ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు, సొంత ఎజెండా కోసం ఈటల రాజేందర్ రాజీనామా చేసిండు. 2001లో ఏ పదవి లేదు రాజేందర్కు. సర్పంచ్, ఎంపీటీసీగా అనుభవం లేనప్పటికీ.. నీకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు. ఫ్లోర్ లీడర్గా, మంత్రిగా అవకాశం కల్పించారు. మంత్రిగా కొనసాగుతూ దళితుల భూములను లాక్కొవడం తప్పు కాదా? తప్పును కప్పిపుచ్చుకునేందుకు రాజీనామా చేశావు. ఈటలను చేసి ఓటేయ్యలేదు. కేసీఆర్ను, కారు గుర్తును చూసి ఓటేశారు హుజూరాబాద్ ప్రజలు. దళిత బంధు పథకాన్ని కూడా విమర్శిస్తున్నావు. దళితులకు దళితబంధు ఇవ్వొద్దా? వాళ్లు బాగుపడొద్దా? నఈ జీవీంతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావు. డిపాజిట్లు కూడా దక్కవు. ఓటమి కోసం శాయశక్తులా పని చేస్తాను. – సంఘం ఐలయ్య ( పెద్దపాపయ్య పల్లి, హుజూరాబాద్ మండలం )
కరెంట్ కోతలతో రైతులు గతంలో అనేక ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉచిత 24 గంటల కరెంట్తో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతు బంధు అమలు చేయడంతో పెట్టుబడి ఇబ్బంది లేదు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తవడంతో సాగునీటికి కొదవ లేదు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. దళితులను ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ గుర్తించలేదు. లోన్ల పేరిట లక్ష రూపాయాలు ఇచ్చి చేతులు దులుపుకునేవారు. పేదలను కూడా ఉన్నత వర్గాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. రైతు బంధు మాదిరిగానే దళిత బంధును అమలు చేయడం గొప్ప విషయం. – రామచందర్ ( ఉప్పల్ గ్రామం, కమలాపూర్ మండలం )