వర్గల్, ఏప్రిల్ 29: ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిందో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని తున్కిఖల్సాలో పార్టీ మండలాధ్యక్షుడు, తున్కిఖల్సా మాజీ సర్పంచ్ సంధ్యాజానీభాయ్, గ్రామకమిటీ అధ్యక్షుడు బాబుగౌడ్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ 5 నెలల్లో ఎన్ని హామీలు అమలు చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకోవల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలమల్లుయాదవ్, ఎంపీపీ లతారమేశ్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరాజు, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు లింగ నాగరాజు, పార్టీ సీనియర్ నాయకుడు అంబార్పేట కరుణాకర్రెడ్డి, నర్సింహారెడ్డి, తుమ్మ గణేశ్, నాచారం రాములు గౌడ్, జయపాల్ రెడ్డి, పాపిరెడ్డి, భీంరెడ్డి, మురళీ గౌడ్, కాసా జనార్దన్, మల్లెల జహంగీర్యాదవ్, కట్టె వెంకటేశం, తున్కిఖల్సా గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.