భోపాల్: దేశం మొత్తం మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకొంటున్న నేపథ్యంలో హిందూ మహాసభ మాత్రం ఆయనను చంపిన నాథూరాం గాడ్సేను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. గాడ్సేతో పాటు మహాత్ముడి హత్య కుట్రలో పాలుపంచుకున్న నారాయణ్ ఆప్టేను కూడా గుర్తుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆదివారం ‘గాడ్సే-ఆప్టే స్మృతి దివస్’గా జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి