Group 1 | గ్రూప్1 నియామకాలపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ స్టేపై టీజీపీఎస్సీతోపాటు పలువురు అభ్యర్తులు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. నియామకాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఇరువైపులా వాదనలు పూర్తి కాగా.. హైకోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది.
అనేక మలుపులు తిరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్లో ఇప్పటికే నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్ నియామక పత్రాలు సైతం అందజేసింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఫలితాలు రద్దుచేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పై డివిజన్ బెంచ్ స్టే విధించి, తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని స్పష్టంచేసింది.
Cognizant jobs | కాగ్నిజెంట్లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Chandrahas | చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం .. పోలీస్ కేసు వరకు వెళ్లిన తగాదా