న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు తీర్పును ఫిబ్రవరి 28న రిజర్వు చేసిందని, ఇప్పటికీ తన నిర్ణయాన్నినిర్ణయాన్ని ప్రకటించడం లేదని చెప్పారు. హేమంత్ సోరెన్ను మనీలాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. అంతకుముందు ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.