Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. నోనీ ( Noney ) జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇంఫాల్-సిల్చార్ (Imphal-Silchar) హైవేపై సుమారు 500 గూడ్స్ వాహనాలు (goods vehicles ) ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని ఇరాంగ్, అవాంగ్ఖుల్ పార్ట్ 2, ఖోంగ్సాంగ్, రంగ్ఖుయ్ గ్రామాల మధ్య జాతీయ రహదారి 37పై బుధవారం కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ‘గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కనీసం 500 గూడ్స్ వాహనాలు హైవేలోని వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయాయి. రహదారిని క్లియర్ చేసి, ట్రాఫిక్ను తిరిగి ప్రారంభించే పనులు జరుగుతున్నాయి’ అని వారు వెల్లడించారు.
కాగా, గతేడాది జూన్లో కురిసిన భారీ వర్షాలకు నోనీ జిల్లాలో రైల్వే నిర్మాణ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. జూన్ 30న జిరిబామ్-ఇంఫాల్ రైల్వే లైన్లోని టుపుల్ రైల్వే యార్డ్ నిర్మాణ స్థలంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో సుమారు 61 మంది మరణించారు.
కాగా, గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా దెబ్బతిన్న ఈశాన్య రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం వల్ల నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు ఈ ఏడాది మేలో రాష్ట్రంలో జాతి ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణలు మూడు నెలలకు పైగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 160 మందికి పైగా మరణించారు. అనేకమంది కనిపించకుండా పోయారు.
Also Read..
Hot Chocolate | విమానంలో హాట్ చాక్లెట్ పడి చిన్నారికి గాయాలు.. స్పందించిన విస్తారా
Boat Capsize | ఘోర ప్రమాదం.. వలసదారులతో వెళ్తున్న పడవ మునిగి 63 మంది మృతి
Bhagavanth Kesari | భగవంత్ కేసరి నుంచి సాలిడ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్