ఉమ్మడి రాష్ట్రంలో వేల మందికి ఇబ్బంది
సమస్యను తీర్చిన తెలంగాణ ప్రభుత్వం
12 చోట్ల ఫ్లాట్లు, కమర్షియల్ స్పేస్ కొన్నసుమారు 2 వేల మందికి శుభవార్త
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూముల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హౌసింగ్ బోర్డు 2006- 2008 మధ్య కాలంలో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్లలోని బోర్డు భూముల్లో 18 జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల అభివృద్ధికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ షేర్ చెల్లించని కారణంగా, 2012 నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. మొత్తం 18 ప్రాజెక్టుల్లో అప్పటికే రెండు చోట్ల రిజిస్ట్రేషన్లు పూర్తికాగా, లీగల్ సమస్యలు, లిటిగేషన్లు, కోర్టు కేసుల కారణంగా మరో 4 చోట్ల అసలు పనులే ప్రారంభం కాలేదు.
ప్రభుత్వ నిర్ణయంతో మిగిలిన 12 ప్రాంతాల్లో ఫ్లాట్లు, కమర్షియల్ స్పేస్లు కొనుగోలు చేసిన సుమారు 2 వేల మంది ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడంతో సమస్య పెండింగ్లోనే ఉండిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు సార్లు భేటీ అయిన క్యాబినెట్ సబ్ కమిటీ.. జాయింట్ వెంచర్లు అభివృద్ధి చేసిన సంస్థలు ప్రభుత్వానికి బకాయిపడ్డ రెవెన్యూ షేర్ చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోడానికి అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.
మొత్తం 360 ఎకరాల భూమి కేటాయింపు
జేవీల కోసం అప్పటి ప్రభుత్వం మొత్తం 18 ప్రాజెక్టులకు 360 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించి డెవలపర్ సంస్థలు రూ.1,200 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. ఒప్పందం ప్రకారం విక్రయాల్లో 2- 5 శాతం రెవెన్యూ షేర్ చెల్లించాలనే నిబంధన ఉన్నది. చాలా సంస్థలు దానిని తుంగలో తొక్కడంతో అప్పటి ప్రభుత్వం అర్ధంతరంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. దీంతో వేల మంది నష్టపోయారు. రూ. 50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు డెవలపర్లకు చెల్లించినా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. 2012 నుంచి ఈ సమస్య ఇలాగే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో తెలంగాణ హౌసింగ్ బోర్డుకు రెవెన్యూషేర్గా రూ.850 కోట్లు రానున్నాయి. ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ శాఖకు దీని ద్వారా మరో రూ.400 కోట్లు సమకూరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
బకాయిలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు
డెవలపర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న రెవెన్యూషేర్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు అవుతాయి. చెల్లించకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లినా లాభం ఉం డదు. కొన్ని సంస్థలు ఈ నెలాఖరుకు డబ్బులు చెల్లించి, జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకుంటామని చెప్పాయి. వాటికి అనుమతులు ఇస్తాం. ఇండ్లు, కమర్షియల్ ఫ్లాట్లు గతంలో ఏ ధరకైతే కొన్నారో ఆ ధరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
– కే శ్రీనివాస్, హౌసింగ్ బోర్డ్, సీఈ
ప్రభుత్వం అనుమతిచ్చిన 18 ప్రాజెక్టుల వివరాలు..
రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న రెండు ప్రాజెక్టులు
బాబ్జీ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కూకట్పల్లి)
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (గచ్చిబౌలి)
అసలు మొదలే కానీ నాలుగు ప్రాజెక్టులు
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు అనుమతించిన ప్రాజెక్టులు