సిటీబ్యూరో, డిసెంబర్ 27: హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణతా శా తం పెంచాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను కలెక్టర్ శర్మ న్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కళాశాలల విద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అలాగే, కాలేజీలలో హాజరు శాతం పెంచాలని, ఆ మేరకు అంద రూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, డిగ్రీ కాలేజీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీలు న్నాయో తెలుసుకున్నారు. పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ప్రస్తుతం ఏయే కోర్సులు ఉన్నాయి? వాటిలో ప్రవేశాల శాతం ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా డిగ్రీ కాలేజీ క్యాం పస్లో హరితహారం నిర్వహించాలని సూచించారు. మం చినీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, మరుగుదొడ్లు నిర్వహణ వంటి వాటి గురించి ప్రి న్సిపాళ్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జి ల్లా ఉపాధి శాఖ అధికారిని మైత్రి ప్రియ మాట్లాడుతూ, వి ద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందించడానికి ప్రతి డిగ్రీ కాలేజీలో ఒక ప్రత్యేక గదిని కేటాయించాలన్నా రు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర కుమార్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రామారావు, డీఆర్సీ కోఆర్డినేటర్ విజయప్రసాద్ రావు, వివిధ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీ సర్ సరళ కుమారితో పాటు అధికారులు పాల్గొన్నారు.