మెదక్ : మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరేగించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు.
శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు. శిలువకు తనకు తానే లోక పాపములను పోగొట్టుటకు శిలువ ఎక్కాడు.
ఆ దినమున పలికిన 7 ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈ రోజు ప్రత్యేకత. ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ ప్రేమ్సుకుమార్ మాట్లాడుతూ.. ఏసు శిలువ వేయబడిన తర్వాత తన చివరి ఏడు మాటల గురించి భక్తులకు వివరించారు.
ఈ సందర్భంగా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు. గత నలబై రోజులుగా భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేపట్టి 7 ప్రవచనాలను 7 మంది గురువులు ధ్యానం చేశారు. యేసు మాటల్లో ఉన్న ఆధ్యాత్మికతను భక్తులకు బోధించారు.
కరోనా నేపథ్యంలో తక్కువ మంది భక్తులను చర్చిలోకి అనుమతించి భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనల్లో పాల్గొనేలా చర్చి కమిటీ చర్యలు తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
నేను కరుణానిధి బిడ్డను.. బీజేపీ బెదిరింపులకు భయపడను: స్టాలిన్