టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్లవీరయ్యపల్లెకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులతో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. పార్టీకి ద్రోహం చేసేవారిని క్షమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
వరంగల్, జూలై 12 : నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 13వ రోజు మంగళవారం అమ్మవారు మాత్రా ముద్రా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అలయ ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు ఉత్సవ మూర్తుల్లో ఇచ్చా శక్తిని ‘మాత్రా ముద్రా క్రమం’లో జ్ఞాన శక్తిని సర్వ మంగళ జ్వాలా మాలినిగా అమ్మవారిని అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా బుధవారం భద్రకాళి అమ్మవారు శాకంబరీగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఉదయం 3 గంటల నుంచి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించనున్నట్లు ఈవో శేషు భారతి తెలిపారు. అలంకరణ సమయంలో భక్తులకు అనుమతి ఉండదని, ఉదయం 9 గంటల నుంచి శాకాంబరీ అలంకరణలో ఉన్న భద్రకాళీ అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గురువారం ఉదయం 11 గంటలకు వ్యాస పూజ, మహా పూర్ణాహుతితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నట్లు ఈవో వివరించారు.