శ్రీనగర్ : సొంత పార్టీ ఏర్పాట్లలో భాగంగా గులాం నబీ ఆజాద్ కశ్మీర్లో ర్యాలీలకు షెడ్యూల్ ఖరారు చేసేందుకు ముందు లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ టెర్రర్ ఫ్రంట్ ఆయనను హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలపై ఆయనను బెదిరిస్తూ పోస్టర్లను ప్రచారంలో పెట్టారు.
ఆజాద్ను రాజకీయ ఊసరవెల్లిగా అభివర్ణిస్తూ ద్రోహి హృదయంలో విశ్వాసం ఉండదని, ప్రజలను నమ్మబలుకుతూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పోస్టర్లో ఆరోపించింది. కశ్మీర్ రాజకీయాల్లో ఆజాద్ చొరవ ముందస్తు పధకం ప్రకారం సాగుతున్నదని, కాంగ్రెస్ను వీడే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారని పోస్టర్ పేర్కొంది.