హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : మైనారిటీ అభ్యర్థులకు యూపీఎస్సీ నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్-2027 కోసం ఉచిత శిక్షణ ఇస్తామని మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5లక్షల్లోపు కలిగి ఉండి, యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కాలేజీల్లో మూడేండ్ల డిగ్రీ పూర్తిచేసిన వారు శిక్షణకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు cet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 14న జిల్లా కేంద్రాలకు సమీపంలోని మైనారిటీ గురుకులాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిసారు.