లక్నో : పెళ్లింట విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకున్నది. కమలాపూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగిన వివాహ శుక్రవారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఈ క్రమంలో బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడి పెళ్లి మండపంపై పడిందని వరుడు తెలిపాడు. దీంతో షార్ట్ సర్క్యూట్తో జరిగి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. వారిని వెంటనే అంబులెన్స్లో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట నలుగురు మృతి చెందడంతో విషాదం అలుముకుంది. బంధువుల రోధనలు మిన్నంటాయి.
Sitapur: Four people died and three others injured due to electrocution during a marriage ceremony at a village in Kamalapur area last night.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 28, 2021
"Due to strong winds, a pole of the pandal touched a high voltage line running above it, resulting in the incident," the groom said. pic.twitter.com/K9dSBiuuz5