హైదరాబాద్ : శంషాబాద్లోని విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. ఫ్లైట్ నం.జీ9.459లో షార్జా నుంచి ప్రయాణికుడు (భారతీయుడు) సౌదీ రియాల్స్, దిర్హమ్ నోట్లను అక్రమంగా తరలిస్తుండగా సీఐఎస్ఎఫ్ గుర్తించింది. పట్టుకున్న విదేశీ కరెన్సీ విలువ భారత కరెన్సీలో రూ.10లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అక్రమంగా కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.