హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు డ్యామ్లోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ఫ్లో 21,580 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,500గా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1090 అడుగుల నీరుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 90.31 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.