హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 19,987 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు.. ప్రస్తుతం 816.80 అడుగుల మేర నీరుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 38.5730 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్ ఉత్పత్తితో 12,713 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.