హైదరాబాద్ : తెలంగాణలో శుక్ర, శనివారాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని తెలిపింది. జార్ఖండ్ నుంచి ఒడిశా.. దక్షిణ కోస్తా మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి వ్యాప్తించి ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.