కోల్కతా : నగరంలోని స్ట్రాండ్ రోడ్లోని ఓ భవనంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన 11 వాహనాలను తరలించి, మంటలు ఆర్పుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలోని నాలుగో ఫ్లోర్లోని బ్యాంకులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణం కావొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పివేస్తున్నామని అధికారి పేర్కొన్నారు. ఈ నెలలో స్ట్రాండ్ రోడ్లోని రైల్వే భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే.