న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఐసీయూ వార్డులో అగ్నికీలలు చెలరేగడంతో అప్రమత్తమైన వైద్యులు, సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అయితే ఈ ప్రమాదంలో రోగులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ వార్డులో ఉన్న 50 మంది రోగులను ఇతర వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ర్ట రాజధాని ముంబైలోని భాందుప్ ప్రాంతంలో ఉన్న డ్రీమ్స్ మాల్ భవనంలోని సన్రైజ్ ఆస్పత్రిలో మార్చి 26వ తేదీన అగ్నిప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ అగ్నిప్రమాదంలో 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు డీసీపీ ప్రశాంత్ కదమ్ వెల్లడించారు. ఆస్పత్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..