యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి(Yadadri district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత(Swimming) సరదా ఇద్దరి ప్రాణాలను(Died )బలి తీసుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మోటకొండూర్ మండలం చాడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూర్(ఎం) మండలం రాయపల్లి గ్రామానికి తండ్రీ, కొడుకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి చనిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.