MI vs SRH : ముంబై గడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తేలిపోయారు. బౌలింగ్కు అనుకూలించిన వాంఖడే పిచ్పై దంచలేక డగౌట్కు క్యూ కట్టారు. టాపార్డర్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) ఒక్కడే ఫర్వాలేదనిపించగా.. చివర్లో కమిన్స్(35 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మార్కో జాన్సెన్(17) దంచాడు. దాంతో హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేయలగలిగింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/31) పీయూష్ చావ్లా(3/33)లు రాణించారు.
టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా హైదరాబాద్కు బ్యాటింగ్ ఇవ్వగానే ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. ఐపీఎల్ రికార్డులు బద్ధలవ్వడం ఖాయమనుకున్నారంతా. కానీ, అభిమానులు అనుకున్నదొకటి అయిందొకటి. పవర్ ప్లేలో ఓపెనర్ అభిషేక్ శర్మ(11)ను బుమ్రా ఔట్ చేయగా.. మర్క్రమ్ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్(5)ను కంబోజీ బౌల్డ్ చేశాడు. అక్కడితో హైదరాబాద్ స్కోర్ వేగం తగ్గింది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్(48), నితీశ్ కుమార్(20)లు ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ పాండ్యా ఈ జోడీని విడదీసి స్కోర్బోర్డుకు బ్రేక్లు వేశాడు.
కమిన్స్(35 నాటౌట్)
ఆ కాసేపటికే పీయుష్ చావ్లా డేంజరస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్(2)లనున బోల్తా కొట్టించడంతో వంద లోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. షహ్బాజ్ అహ్మద్(10), మార్కో జాన్సెన్(17)లు జట్టు స్కోర్ వంద దాటించారు. అయితే.. పాండ్యా ఒకే ఓవర్లో ఈ ఇద్దరిని వెనక్కి పంపి.. ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. కానీ, కెప్టెన్ కమిన్స్(35 నాటౌట్), ఇంప్యాక్ట్ ప్లేయర్ సన్వీర్ సింగ్(8 నాటౌట్)లు పట్టుదలగా పోరాడి 9వ వికెట్కు రన్స్ జోడించారు. తుషార వేసిన 20వ ఓవర్లో కమిన్స్ సిక్సర్, ఫోర్ బాదాడు. దాంతో, వాంఖడేలో హైదరాబాద్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.