పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా స్పందించారు. పీఓకేను భారత్లో విలీనం చేస్తామని రాజ్నాథ్ సింగ్ ప్రకటనను ఫరూక్ అబ్ధుల్లా ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి ఇలా చెబితే ఇక ముందుకెళ్లడమే..వారిని ఆపడానికి మనం ఎవరని వ్యాఖ్యానించారు.
అయితే పాకిస్తాన్ కూడా గాజులు తొడుక్కుని కూర్చోలేదని గుర్తుంచుకోవాలి, పాక్ వద్ద అణు బాంబు ఉంది, దురదృష్టవశాత్తూ ఆ అణుబాంబు మనపై పడుతుందని పేర్కొన్నారు. ఇక అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్ము కశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
ఈ విషయంలో తన మాటలను గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామని, కానీ వారు మాత్రం సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు.
Read More :
Vinod Kumar | యువత కోసం అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తా