నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 15: జొన్నలు కొనుగోలు చేస్తదని కాంగ్రెస్ సర్కార్ను నమ్మి మోసపోయినం.. జొన్నలు సాగు చేసి తప్పు చేశామంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు మోకాళ్లపై కూర్చొని గుంజీలు తీసి నిరసన తెలిపారు. పంట కోసి నెల రోజులైనదని, నామ్కేవాస్తేగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినదని, కానీ కొనుగోళ్లు చేపట్టడం లేదని అన్నారు. అధికారులను అడిగితే మకలు కొంటున్నం, జొన్న కొనుగోలుకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జొన్నలు కొనాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఎదుట రైతులు బోథ్-నిర్మల్ రహదారిపై బైఠాయించారు. జొన్నలు తెచ్చి వారమైనా కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ పురుషోత్తం, కేంద్రం ఇన్చార్జి బారే భూషణ్ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వెనుకాల రైల్వే ఓవర్బ్రిడ్జి పక్కన బారులు తీరిన మక్కల లోడ్తో వచ్చిన ట్రాక్టర్లు