న్యూఢిల్లీ, మే 15: కొందరు నిరుద్యోగ యువకులను బొద్దింకలతో పోల్చిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. వారు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తలుగా మారిపోయి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించారని ఆరోపించారు. ‘సీనియర్ అడ్వకేట్ హోదా కోసం ప్రయత్నిస్తూ తిరుగుతున్నారని’ ఒక న్యాయవాదిని మందలిస్తున్న సమయంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
సమాజంలో ఇప్పటికే వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఉన్నారని, వారితో మీరూ చేతులు కలపాలనుకుంటున్నారా? అని పిటిషనర్ను ప్రశ్నించారు. ‘ప్రపంచం మొత్తం సీనియర్ న్యాయవాది హోదా పొందే అర్హత ఉండవచ్చు. అయితే మీకు మాత్రం ఆ అర్హత లేదు’ అని బెంచ్ ఆ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
ఒక వేశ ఢిల్లీ హైకోర్టు పిటిషనర్కు సీనియర్ అడ్వకేట్ హోదాను ప్రదానం చేసినా అతని వృత్తిపరమైన ప్రవర్తనను చూసి సుప్రీంకోర్టు దానిని రద్దు చేస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఫేస్బుక్లో పిటిషనర్ ఉపయోగించిన భాషను కూడా సీజేఐ ప్రస్తావించారు. దీనిపై పిటిషనర్ ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు.