పెద్దపల్లి, మే 4 (నమస్తే తెలంగాణ): ఎన్నిక కాక ముందే సోషల్ మీడియాలో ఎంపీగా చెలామణి అవుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి చుక్కెదురైంది. దీనిపై ఏప్రిల్ 27న ‘ఎన్నిక కాకముందే ఎంపీ’ శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురిత మైంది.
ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందాయి. దీంతో ఎన్నికల అధికారులు కోడ్ ఉల్లంఘనగా పరిగణించి నోటీసులు జారీ చేయగా.. వంశీకృష్ణ ఫేస్బుక్ అకౌంట్ను మార్చేశారు. ఎంపీ స్థానంలో జీ వంశీకృష్ణ ఎఫ్సీ(ఫ్యాన్స్ క్లబ్)గా మార్చారు. అలాగే డీపీ, కవర్ పేజీలలో కేవలం వంశీకృష్ణ ఉన్న ఫొటోలనే ఉంచారు.