న్యూఢిల్లీ: నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ పడుతున్న కన్హయ్య కుమార్(Kanhaiya Kumar)పై అటాక్ జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. కొంత మంది ఆయనపై చేయి చేసుకున్నారు. ఈ అటాక్కు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఈస్ట్ ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పుర్లో ఈ ఘటన జరిగింది. ఆ దాడికి చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Jordaaar thappad ☠️😂🤣
Kanhaiya Kumar ko laga ye JNU hai. pic.twitter.com/38Ohlv3SEt
— BALA (@erbmjha) May 17, 2024
కన్హయ్యను కొట్టిన ఇద్దరు నిందితులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. దేశాన్ని విభజించాలని కన్హయ్య కామెంట్ చేశారని, అందుకే అతనిపై అటాక్ చేసినట్లు ఆ ఇద్దరూ ఓ వీడియోలో పేర్కొన్నారు. భారతీయ సైన్యంపై కాంగ్రెస్ నేత అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపించారు.
bhai ne aisi kya ilaaj kar di kanhaiya kumar ki? 🤔pic.twitter.com/YoSHxePoSE
— Keh Ke Peheno (@coolfunnytshirt) May 18, 2024
కర్తార్నగర్లో ఆఫీసు నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ఎనిమిది మంది వరకు వచ్చి కన్హయ్యకు పూలమాల వేశారని, ఆ తర్వాత అతనిపై ఇంకు చల్లి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అటాక్లో నలుగురు మహిళలు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఓ మహిళ జర్నలిస్టు దగ్గరలో ఉన్న మోరీలో పడిపోయింది.