న్యూఢిల్లీ : వాయు కాలుష్యం (Air Pollution) ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేయగా తాజాగా కాలుష్యం క్యాన్సర్లకూ దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాకరస్ధాయికి చేరడంతో ఈ అంశంపై హాట్ డిబేట్ సాగుతోంది. వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు ఢిల్లీ వాసులను హెచ్చరించారు.
వాయు కాలుష్యం క్యాన్సర్ ముప్పు కారకమనేందుకు ఆధారాలున్నాయని ఎయిమ్స్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ పీయూష్ రంజన్ చెప్పారు. శ్వాస కోశ వ్యవస్ధనూ వాయు కాలుష్యం దెబ్బతీస్తుందని అన్నారు. మరోవైపు వాయు కాలుష్యానికి గుండె పోటు, అర్ధరైటిస్, స్ట్రోక్స్ వంటి హృద్రోగాలకు నేరుగా సంబంధం ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయని డాక్టర్ రంజన్ పేర్కొన్నారు.
పలు రకాల క్యాన్సర్లతో వాయు కాలుష్యానికి సంబంధం ఉందనేందుకు శాస్త్రీయ ఆధారాలున్నాయని చెప్పారు. వాయు కాలుష్యం మనుషుల డీఎన్ఏను ధ్వంసం చేయడంతో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయని చెప్పారు. వాయుకాలుష్యంతో శరీరంలో వాపు ప్రక్రియ పెరగడంతో పాటు రోగనిరోధక వ్యవస్ధను క్షీణింపచేయడంతో క్యాన్సర్ కణాలతో శరీరం పోరాడటం సంక్లిష్టంగా మారుతుందని అన్నారు.
Read More :
ODI World Cup 2023 | హిట్మ్యాన్కు ‘బెస్ట్ ఫీల్డర్ మెడల్’.. సెలబ్రేషన్ వీడియో వైరల్