మహబూబ్నగర్ : ప్రతి ఒక్కరు జాతీయ భావనను పెంపొందించుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయడం ఎంతో సంతోషకరమైన విషయమని ఆయన తెలిపారు.
వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ ఏవీడీ సినిమా థియేటర్లో విద్యార్థుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సినిమా తిలకించారు. మోనప్పగుట్టలో ఉన్న జ్ఞాన భారతి ఉన్నత పాఠశాల వద్ద ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి జెండాలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..స్వాతంత్ర్య పోరాటం మనం చూడలేదని కానీ అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం చూశామని తెలిపారు. సీఎం చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరిలో జాతీయ భావన పెంపొందించుకునాలన్నారు. కులం, మతం పేరిట కొందరు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని వారు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, డీసీసీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.