సిద్దిపేట, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మెదక్/సంగారెడ్డి : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ పండుగ ఆదివారం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగిసింది. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. చెరువు గట్ల వద్ద ప్రభుత్వం లైటింగ్స్ ఏర్పాటు చేసింది. బతుకమ్మలు నిమజ్జనం చేసే చెరువులకు ప్రత్యేకంగా బతుకమ్మ మెట్లను రంగులతో అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పేర్చిన బతుకమ్మలను గ్రామ, పట్టణ చావిడిలు చెరువు గట్ల వద్ద సాయంత్రం ఉంచి మహిళలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు బతుకమ్మ ఉయ్యాలో…అంటూ తీరొక్క పాటలు పాడారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక, తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మ. ఇది ఆడపడుచుల పండుగ. ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆదివారం ముగిసింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. అడవికి, మార్కెట్లకు వెళ్లి వివిధ రకాల పూలను తీసుకొచ్చి ఇంటిల్లిపాది బతుకమ్మలను పేర్చారు. పేర్చిన బతుకమ్మలను గ్రామ, పట్టణ చావిడిలు చెరువుగట్ల వద్ద సాయంత్రం పెట్టి ఆడారు. మహిళలు నూతన వస్ర్తాలు ధరించి, మెడ లో నగలతో ముస్తాబై పూలతో పేర్చిన బతుకమ్మను గా జుల గలగల వాయిద్యాలుగా మలిచి పల్లవికి శృతి కలుపుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ… బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యా లో.. అంటూ తీరొక్క పాటలు పాడుతూ ఆడారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ ఘనంగా ముగిసిం ది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల తదితర పట్టణ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ సంబురా లు అంబరాన్నంటాయి. సిద్దిపేటలో మినీ ట్యాంకు బండ్గా మారిన కోమటి చెరువు ప్రాంగణమంతా పూలవనంతో మురిసింది. జిల్ల్లా ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకొన్నారు. చెరువు కట్టల వద్ద ప్రభుత్వం లైటింగ్ ఏర్పాటు చేసింది. బతుకమ్మలు నిమజ్జనం చేసే చెరువులకు ప్రత్యేకంగా బతుకమ్మ మెట్లను రంగులతో అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చెరువు కట్టలు విద్యుత్ దీపాల కాంతులతో వెలిగి పోయాయి. ఇలా అన్ని చెరువు కట్టలు విద్యుత్ వెలుగులతో జిగేలుమన్నాయి. అయా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మారుమోగిన రామక్క పాట..
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ సింగర్ లక్ష్మమ్మ పాడిన రామక్క పాట గ్రామాల్లో మారుమోగింది. సద్దుల బతుకమ్మలో ‘గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ… గులాబీల జెండలే రామక్క…. గుర్తుల గుర్తుంచుకో రామక్క’ అంటూ పాడిన పాటతో సద్దుల బతుకమ్మను ఆడిపాడారు. సద్దుల బతుకమ్మ నిమజ్జనం అనంతరం మహిళలు గ్రామ చావిడి వద్ద డీజేలు పెట్టుకొని రామక్క పాటపై కోలాటం ఆడారు.