రవీంద్రభారతి, నవంబర్ 12: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం, సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో పదో వార్షికోత్సవ జీవన సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న హాజరై మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య కళాపీటం పదో వార్షికోత్సవం సందర్భంగా పలువురి కళాకారులకు జీవన సాఫల్య పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. జీవన సాఫల్య పురస్కారాలను కురిమిళ్ల నర్సింహాగౌడ్, చెరుపల్లి యాదగిరి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు డా. ఓలేటి పార్వతీశం, వ్యవస్థాపక అధ్యక్షులు చిక్క రామదాస్, చిక్కా దేవదాస్, దైవజ్ఞశర్మ, చిక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన, కవులు, కళాకారులచే కవి సమ్మేళనం నిర్వహించారు.