తిరుపతి : తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను టీటీడీ ప్రవేశ పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ ద్వారా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఘట్ రోడ్డులో నడపాలని పాలకమండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా 35 టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ వాహనాలను టీటీడీకొనుగోలు చేసింది. టీటీడీ పరిధిలోని డిప్యూటీ ఈవో స్థాయి అధికారులుకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కేటాయించనుంది. ఐదు సంవత్సరాల పాటు నెలకు ఒక వాహనానికి రూ. 35 వేలు చొప్పున టాటా కంపెనీకి టీటీడీ నగదు బదిలీ చేయనుంది.
అయితే ప్రస్తుతం వినియోగిస్తూన్న డిజిల్ వాహనాలను తిరుమల నుంచి అంచెలంచెలుగా టీటీడీ తొలగించనుంది. ఈ వాహనాలను తిరుపతిలోని టాటా కంపెనీ నుంచి కొనుగోలు చేసిన టీటీడీ రేపు ఉదయం శ్రీవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ అధికారులకు అందజేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
అంగన్ వాడీలకు అండగా ఉంటాం : మంత్రి హరీశ్రావు
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన