కరీంనగర్ : అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్లో టీఎన్జీఓలు, అంగన్ వాడీలు నిర్వహించిన కృతజ్ఞత సభలో మరో మంత్రి గంగులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అంగన్ వాడీల వేతనాలు పెంచామన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో అంగన్ వాడీలకు నెల వేతనం రూ. 3,700 ఉంటే మన రాష్ట్రంలో రూ. 13,650 ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇందులో కేంద్రం ఇస్తున్నది కేవలం రూ. 2,700 మాత్రమే అని పేర్కొన్నారు. మొత్తం వేతనం మేమే ఇస్తున్నామని బీజేపీ నాయకులు గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామన్నారు.
ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం వంట గ్యాస్ ధరలు పెంచి వచ్చే సబ్సిడీని తగ్గించించిందన్నారు. మీ సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వానికి అండగ ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. అంగన్ వాడీలు ఇచ్చిన సమస్యల్లో నా పరిధిలో ఉన్నవి పరిష్కరిస్తా. మిగతా సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన