వెల్గటూర్, ఏప్రిల్ 28: కార్మిక నాయకుడు, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖరారైందని పార్టీ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రఘువీర్సింగ్ పేర్కొన్నారు. వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలోని ఓ ఫంక్షన్హాల్లో వెల్గటూర్, ఎండపల్లి మండలాల ముఖ్య కార్యకర్తలతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక, కర్షక నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపు ఖాయమైందని, మెజార్టీ కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ఈ నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలను గడపగడపకూ చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, నాయకులు గాజుల మల్లేశం, పత్తిపాక వెంకటేశ్, ఏలేటి కృష్ణారెడ్డి, గూడ రాంరెడ్డి, గోలి రత్నాకర్, ఏలేటి చంద్రారెడ్డి, జూపాక కుమార్, రియాజ్, పోడెటి రవి, బిడారి తిరుపతి, నైనాల అజయ్, కుమ్మరి వెంకటేశ్, మాదాసు సత్తయ్య, చింతల తిరుపతి, గంగుల నగేశ్, అల్లె వెంకటేశ్, ఇప్పల రాజ్కుమార్, కొప్పుల సురేశ్, కుశనపల్లి రవి, గాగిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, కోడి గంగయ్య, హరీశ్, తిరుపతి, జాని, రాములు, వెంకటేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.