వీణవంక, మే 9: ప్రజల సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపిద్దామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని వల్భాపూర్, వీణవంక, కొండపాక గ్రామాల్లో ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలకిషన్రావు, నాయకులు పరిపాటి రవీందర్రెడ్డి, కామిడి శ్రీనివాస్రెడ్డి, కాసర్ల సుధాకర్, వెంకటస్వామి, రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.