నిర్మల్ అర్బన్, మార్చి 6 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గాయత్రీపురం కాలనీలో బ్రాహ్మణ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, సోఫీనగర్ కాలనీలోని మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలీచాలని వేతనాలతో జీవితం గడిపేవారని, కానీ తెలంగాణ సర్కారు ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి, కౌన్సిలర్లు నేరెళ్ల వేణు, నాయకులు డీ శ్రీనివాస్, నర్సయ్య, నరేశ్, దత్తాద్రి అంగ జగదీశ్, మైనార్టీ ఉద్యోగులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
దర్శన్ స్టూడియో నిర్మించిన ‘చదువంటే నాకు ఇష్టం’షార్ట్ ఫిలిమ్ను మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్తమాన, భవిష్యత్ తరాల ప్రజలకు ఉపయోగపడే సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ చిత్రీకరించాలన్నారు. జిల్లా ఏర్పాటు కావడంతో నిర్మల్ వేగంగా అభివృద్ధి చెందిందని, షార్ట్ ఫిలిమ్స్తో పాటు భారీ చిత్రలకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. రచయిత, దర్శకుడు గణేశ్, కెమెరామెన్ దర్శన్, ఫొటోగ్రాఫర్ చంద్రశేఖర్, వినయ్, వీణ, మహేందర్, మోహన్ చారి, విశ్వనాథ్, శిరీష, ఆనంద్, శ్రీధర్ పాల్గొన్నారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అండతోనే ఉక్రెయిన్ నుంచి క్షేమంగా నిర్మల్ చేరుకున్నానని పట్టణంలోని బుధవార్పేట్ కాలనీకి చెందిన వైద్య విద్యార్థి సాయికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తనను స్వదేశానికి రప్పించేందుకు మంత్రి విశేషంగా కృషిచేశారని, కేంద్ర విదేశాంగ మంత్రితో నిత్యం చర్చించారన్నారు. తనకు మంత్రి ఫోన్ చేసి, ధైర్యం నింపారని తెలిపారు. ఈ సందర్భంగా సాయికృష్ణను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు మల్లికార్జున్రెడ్డి, ముడుసు సత్యనారాయణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.