న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడీ ముందు హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేశారు. దీనిలో భాగంగా ఈడీ విచారణ సాగుతోంది. మనీలాండరింగ్ చట్టం కింద ఖర్గే వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు.