ముంబై : మహారాష్ట్ర మంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్పై చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్లు బుధవారం తెలిపింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో గోవాలా కాంపౌండ్, ముంబై సబర్బన్ కుర్లా (పశ్చిమ), ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న 147.79 ఎకరాల వ్యవసాయ భూమి, కుర్లాలో ఉన్న మూడు ప్లాట్లు, బాంద్రా (పశ్చిమ)లో ఉన్న రెండు రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అవగా.. ప్రస్తుతం నవాబ్ మాలిక్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, బెయిల్ నుంచి తక్షణం విడుదల చేయాలంటూ మాలిక్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. విచారణకు సుప్రీం కోర్టు బుధవారం అంగీకరించింది. దావూద్ ఇబ్రహీంతో సంబంధాల ఆరోపణలపై మనీలాండరింగ్ కేసులో విచారించిన అనంతరం ఈడీ ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్ను అరెస్టు చేసింది.