న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్పై (Exit Polls) గడవు సమయాన్ని ఎన్నికల కమిషన్ (EC) సవరించింది. గురువారం సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి ఈసీ అనుమతించింది.
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్కు అనుమతించిన ఈసీ ఆపై 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించవచ్చని ఈసీ పేర్కొంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 గంటల వరకూ 20.6 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా ఊపందుకుంటోంది.
Read More :