Telangana Assembly Election 2023: తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో సాధారణ ఓటర్లతో పాటు సెలబ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తుతున్నారు. గురువారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో పాటు ప్రముఖులు కూడా క్యూ లైన్లలో నిలుచుని ఓటేయకుండా ఇంట్లో కూర్చున్నవారు ఓటేసేలా ప్రోత్సహిస్తున్నారు. సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రవితేజ, నాని, గోపీచంద్, సుధీర్ బాబు, యాంకర్ సుమ, అక్కినేని నాగార్జున, నాగచైతన్యతో పాటు రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, బలగం హీరోయిన్ కావ్య, దర్శకులు సుకుమార్, ఎస్ఎస్ రాజమౌళిలు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
వెటరన్ యాక్టర్ జగపతి బాబు ఫిల్మ్ నగర్లో ఓటు హక్కు వినియోగించుకోగా విజయ్ దేవరకొండ జూబ్లి హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటేశాడు. నాగార్జున, అమలతో పాటు నాగచైతన్య జూబ్లీ హిల్స్లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లో ఓటు వేయగా రాణా దగ్గుబాటి హైదరాబాద్లోని ఎఫ్ఎన్సీసీ వద్ద ఓటేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రంలో సుమారు 25 శాతం ఓటింగ్ నమోదైంది.
Casted Mine!
Hoping for you all to utilise the right to vote. pic.twitter.com/9i9P3vru7I— Ravi Teja (@RaviTeja_offl) November 30, 2023
Done. pic.twitter.com/rIZCOybIvh
— Nani (@NameisNani) November 30, 2023
#WATCH | Actor Rana Daggubati arrives to cast his vote at FNCC in Hyderabad during Telangana elections pic.twitter.com/pZVtDIxrO1
— ANI (@ANI) November 30, 2023
#WATCH | Actor Vijay Deverakonda arrives at Jubilee Hills Public School in Hyderabad to cast his vote in Telangana Assembly elections pic.twitter.com/BkZmqbsHba
— ANI (@ANI) November 30, 2023