కోహిమా : నాగాలాండ్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. మోకోక్చుంగ్కు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5 గంటలకు భూ ప్రకంపణలు వచ్చాయని, భూకంప కేంద్రాన్ని 81 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని వివరించింది. అలాగే అసోంలోని తేజ్పూర్లో సైతం ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 3.9 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ పేర్కొంది. తేజ్పూర్కు 41 కిలోమీటర్ల దూరంలో, భూమికి 16కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.