హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ను మాదాపూర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 265 కిలోల గంజాయిని తరలిస్తున్న ట్రక్కును సీజ్ చేశారు. ఈ గంజాయి విలువ రూ. 55 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న మహమ్మద్ ఇక్బాల్(35), షారుఖ్(30), మహమ్మద్ సలీం(29)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఇందులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఇక్బాల్. అతని సోదరులైన షారుఖ్, సలీం ట్రక్కు డ్రైవర్లుగా పని చేస్తూ గంజాయి తరలిస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. ఒడిశా నుంచి బయల్దేరిన ట్రక్కు హైదరాబాద్కు చేరుకోగానే మాదాపూర్ పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఆ వాహనాన్ని తనిఖీ చేయగా, డ్రైవర్ క్యాబిన్లోని టూల్ బాక్సులో గంజాయి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.