నిత్యం ఎక్కువగా మంచి నీరు తాగాలని (Water Drinking) పెద్ద వాళ్లతో పాటు వైద్యులు చెప్తుంటారు. నిజానికి నీరు తాగడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చునంట. రోజులో 8 గ్లాసులకు తక్కువ కాకుండా నీరు తాగాలని సూచిస్తుంటారు. ఒక అధ్యయనం ప్రకారం యుక్త వయసులో నీరు సరైన మోతాదులో తీసుకోని వారిలో గుండె సంబంధ సమస్యలు వచ్చాయి. నీటికి, గుండె ఆరోగ్యానికి సంబంధాన్ని వీరి అధ్యయనంలో వివరించారు.
15,792 మందిపై 25 సంవత్సరాల పాటు వీరి అధ్యయనం కొనసాగించి.. నీరు తాగడానికి గుండె వైఫల్యం ప్రమాదం నుంచి బయటపడటానికి సంబంధమున్నదని తేల్చారు. ఈ అధ్యయనాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) శాస్త్రవేత్తలు చేపట్టారు. వీరిలో సీరం సోడియం స్థాయిలను పరీక్షించగా.. నీరు తక్కువగా తీసుకోవడం వల్లనే అనే విషయం వెల్లడైంది.
నిజానికి నిత్యం రెండు లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచించేవారు. అయితే, ఇటీవలి పలు అధ్యయనాలు ప్రజలు అంత మొత్తంలో నీరు తీసుకోవద్దని తేల్చాయి. శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల గుండె వైఫల్యానికి దారితీసే మార్పులను నిరోధించవచ్చునని మా అధ్యయనం సూచిస్తుందని పరిశోధకురాలు నటాలియా డిమిత్రివా తెలిపారు. శరీరంలో సీరం సోడియం స్థాయిలు పెరుగడం, తగ్గడం అనేది గుండె వైఫల్యాని దారితీస్తాయి. అందువల్ల సీరం సోడియం స్థాయిలను మెయింటేన్ చేయడానికి తగినంత నీరు తాగాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. పెరుగనున్న పెన్షన్
తండ్రీకొడుకుల మోసం.. 157 కోట్లు ముంచారు..
త్వరలో భారత్కు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ
అమెరికాను అధిగమించిన భారత్.. దేనిలోనంటే..?
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
అత్తారీ వద్ద బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్
గెలీలీయో టెలిస్కోప్కు 412 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..