హుజూరాబాద్ : శత్రువైన ఇంటికి వచ్చినవారిని సాధారంగా ఆహ్వానించడం మన తెలంగాణ సంప్రదాయం. కానీ హుజూరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా మా ఇంటికి రావద్దంటూ ఏకంగా ఇంటిమందు బోర్డులు పెడుతున్నారు. ఇంతకు ఎవరినో తెలసా? బీజేపీ నాయకులను. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల తీరుతో విసుగు చెందిన ప్రజలు మా ఇంటికి రావద్దు బీజేపీ నాయకుల్లారా అంటూ బోర్డులు పెట్టి ఉప ఎన్నికల వేళ బిజేపీకి ఇక్కడి ప్రజలు చుక్కలు చూపెడుతున్నారు.
గ్యాస్, పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బంది పెడుతున్న తీరును నిరసిస్తూ పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీని బహిష్కరిస్తూ తమ ఇంటికి రావద్దు అంటూ స్వచ్ఛందంగా రాసి గేట్లకు, తలుపులకు తగిలిస్తున్న తీరు బీజేపీపై వ్యతిరేకతకు తెలియజేస్తుంది. ఒకరు ఇద్దరు కాదు 27వ వార్డులో ఇంటింటికి ఇవే బోర్డులు దర్శనవిస్తున్నాయి.
ఒకరు‘వంట గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయం.. దయచేసి ఇబ్బంది పెట్టకండి’.. అని బోర్డు పెడితే, ‘పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయం’.. అని మరొకరు, ‘నిత్యావసర ధరలు పెంచుతున్న బీజేపీకి మేము ఓటు వేయం.. దయచేసి ఇబ్బంది పెట్టకండి’ అంటూ ఇంకొకరు, ‘వీ లవ్ కేసీఆర్, వీ వోట్ ఫర్ కార్’ అంటూ మరో చోట.. ఇలా రకరకాల బోర్డులు పెట్టి బీజేపీ నేతలను హెచ్చరిస్తున్నారు.
ఒక 27వ వార్డే కాదు.. 7వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఇంటి వద్ద ఖాళీ సిలిండర్ను పెట్టి, పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో విసిగిపోయామని పేర్కొంటూ రాసిన బోర్డును ప్రదర్శించడంతో పాటు సమీపంలో పలువురు అదేవిధంగా బోర్డులు పెట్టుకున్నారు. 5వవార్డులో, 7వ వార్డులో కూడా ఇదే విధంగా బీజేపీని బహిష్కరిస్తూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.