బాసర, ఆగస్టు 4: బాసర ట్రిపుల్ ఐటీపై సోషల్ మీడియాలో అపోహలు సృష్టించి విద్యార్థులను గందరగోళానికి గురిచేయొద్దని ఆ సంస్థ డైరెక్టర్ సతీశ్కుమార్ సూచించారు. గురువారం సాయంత్రం మళ్లీ ఫుడ్ పాయిజన్ అయిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వెంటనే ఆయన ట్రిపు ల్ ఐటీలోని దవాఖానను సందర్శించారు.
సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ఆరుగురు విద్యార్థులే అక్కడ ఉన్నారు. వీరిలో ఎవరికీ ఫుడ్ పాయిజన్ కాలేదని అక్కడి డాక్టర్లు వెల్లడించారు. అనంతరం సతీశ్కుమార్ ట్రిపుల్ ఐటీ మెస్ను సందర్శించి అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.