హైదరాబాద్, జనవరి 30/యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులకు భక్తుల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపుమేరకు పలువురు దాతలు స్పందిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ రవివర్మ భూరీ విరాళం సమర్పించారు. రూ.1.16 కోట్ల చెక్కును హైదారాబాద్ ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్కు ఆదివారం అందజేశారు. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు దంపతులు రూ.1.16 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకొన్న ఆయన.. సంబంధిత చెక్కును యాదాద్రి బాలాలయంలో ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్కు అందజేశారు.