నాలుగు ఉద్యోగాలిచ్చే కంపెనీలు నష్టాల్లో ఉన్నాయనగానే వేలకోట్ల ప్రజాధనంతో ఉద్దీపన ప్యాకేజీలిస్తూ, కార్పొరేట్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు శక్తివంచనలేకుండా కష్టపడుతున్న కేంద్రప్రభుత్వం, కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్న ఎవుసానికి ఎసరు పెడుతున్నది. రైతులు పంటలు వేయటానికే భయపడేలా నిర్ణయాలు తీసుకొంటున్నది. తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలోనే కేంద్రం అసలుబుద్ధి తేటతెల్లమైంది. ధాన్యం సేకరణ విషయంలో అసలు ఏం జరిగింది? ఏం జరుగుతున్నది? ఏం జరుగబోతున్నదో చూద్ధాం!