హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): పర్యావరణహితమైన మట్టి గణపతులనే పూజించాలని ప్రజలకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్ గణేశ్ ఆలయం వద్ద మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.
పీసీబీ ద్వారా 1.40 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామని మంత్రులు తెలిపారు. కలర్స్, కెమికల్స్తో తయారు చేసిన గణేశుని విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితమవుతుందని మంత్రులు తెలిపారు.