ఖమ్మం:ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం భవనంపై భాగంలో నూతనంగా నిర్మించిన డైనింగ్ హల్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సోమవారం ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వివిధ విభాగాలలో పని చేస్తున్న మినిస్ట్రీయల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది మధ్యాహ్నభోజనాలు చేసేందుకు వీలుగా లంచ్ రూమ్ ఏర్పాటు చేసి డైనింగ్ టేబుల్స్, కూర్చిలు సమకుర్చినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ లా ఎండ్ ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డీసీపీ ప్రసాద్, ఆర్ఐ సాంబశివరావు, సెక్షన్ సూపరిండెట్లు జానకిరామ్, నాగేశ్వరరావు, హనీఫ్, మినిస్ట్రీయల్ స్టాఫ్ పాల్గొన్నారు.