వరంగల్ : ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గోపి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వీవో, అంగన్వాడీ ఇతర గ్రామస్థాయి అధికారిక కార్యాలయాల నిర్మాణాలకు, ప్రభుత్వ భూమిని కేటాయించాలన్నారు.
ధరణిలో ఉన్న భూ సమస్యలను క్లియర్ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. సంస్థల పేరు మీద కూడా ధరణిలో పట్టా చేయించుకోవచ్చు. ధరణిలో 12 రకాల సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నాయని ఆయన తెలిపారు. నాలా పర్మిషన్ ప్రాబ్లమ్స్ ను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. చెన్నరావుపేట మండల కేంద్రానికి హెల్త్ సెంటర్ మంజూరైంది. కానీ సరిపడా ప్రభుత్వ భూమి లేదన్నారు.
అలాగే రెసిడెన్షియల్ స్కూల్ కోసం పర్మినెంట్ బిల్డింగ్ కావాలని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్, రెవెన్యూ పరిధిలో సమస్య తీవ్రంగా ఉంది. కొండాపూర్ గ్రామంలో 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అది ఫారెస్ట్ రికార్డుల్లో లేదు. పూర్తిగా రెవెన్యూ పరిధిలో ఉందన్నారు. కన్నారావుపేట గ్రామంలో ఎక్కువ భూమి సీలింగ్ లో ఉంది. ఇంకా 194 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే తెలిపారు.