హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ‘డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్’ అఖిలభారత సమావేశానికి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన జైపూర్ చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో సైబర్ క్రైమ్, పోలీస్ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం, ఉగ్రవాద నిరోధంలో ఎదురవుతున్న సవాళ్లు, వామపక్ష తీవ్రవాదం, జైళ్ల సంసరణలు తదితర అంశాలపై చర్చిస్తారు. కొత్త చట్టాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ఫేక్ సాంకేతికత దుర్వినియోగంపై నిపుణులతో చర్చించి, సరైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. దేశవ్యాప్తంగా ఎంపికైన మూడు ఉత్తమ పోలీస్స్టేషన్ల హెస్హెచ్వోలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా తొలిరోజే అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ క్యాటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచిన మన రాష్ట్రంలోని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో బీ నాగేంద్రబాబు అవార్డును అందుకోనున్నారు.